రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: వోలేటి వెంకటేశ్వర్లు
పాడినది: వోలేటి వెంకటేశ్వర్లు
ఇది ద్వంద్వార్థం కలిగిన పాట. నాయిక విరహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, అసలు అర్థం సాధకుడి ఆధ్యాత్మిక వేదన వ్యక్తం చేస్తుంది.
దీని పుట్టుక గురించి మహాభాష్యం చిత్తరంజన్ గారి పుస్తకం లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు - ఆయన మాటల్లోనే చదవండి:
స్వరకల్పన: వోలేటి వెంకటేశ్వర్లు
పాడినది: వోలేటి వెంకటేశ్వర్లు
ఇది ద్వంద్వార్థం కలిగిన పాట. నాయిక విరహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, అసలు అర్థం సాధకుడి ఆధ్యాత్మిక వేదన వ్యక్తం చేస్తుంది.
దీని పుట్టుక గురించి మహాభాష్యం చిత్తరంజన్ గారి పుస్తకం లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు - ఆయన మాటల్లోనే చదవండి:
ఈ పాట ఆవిర్భావించటానికి ప్రేరణ కలిగించిన సందర్భం 1964 లో జరిగింది. అ సంవత్సరం జూలై ప్రాంతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు స్థానిక రవీంద్ర భారతిలో ప్రదర్శించటానికి వర్షఋతువుకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. విజయవాడ కేంద్రం లో ప్రొడ్యుసర్ గా ఉన్న శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగానే నేను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటిలో ఉండగా వోలేటి గారక్కడికి వచ్చారు.
అదే సమయం లో కృష్ణశాస్త్రి గారి కుమారుడు శ్రీ బుజ్జాయి తను కొత్తగా కొని తెచ్చుకున్న హిందుస్తాని ఎల్పీ రికార్డును పక్క గదిలో వింటుండగా శాస్త్రిగారి వద్ద కూర్చున్న మా చెవులలో పడింది. అందరం అ గది లోకి వెళ్లి విన్నం. అది పాకిస్తాన్ లోని విద్వాంసులు సలామత్ అలీ, నజాకత్ అలీ గానం చేసిన పహాడీ రాగపు ఠుమ్రి - "సయ్యా బిన్ ఘర సునా". వోలేటి వారు నాలుగైదు సార్లు అ రికార్డు పదే పదే వేయించుకు విని పరవశులైపోయారు.
హిందుస్తాని సంగీతం లో కుడా మహా విద్వాంసులైన వోలేటి గారు అ పారవశ్యంలో అరగంట సేపు పహాడీ రాగం ఆలపించారు. కృష్ణశాస్త్రి గారు తానొక పాట వ్రాస్తానని, వోలేటి గారిని బాణీ కట్టమని అడిగారు. వెంటనే వోలేటి గారు స్పందించగా రూపొందిన సుమధుర గేయమే ఈ "కడచేనటే సకియా ఈ రాతిరి". రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం లో వోలేటి ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.
అదే సమయం లో కృష్ణశాస్త్రి గారి కుమారుడు శ్రీ బుజ్జాయి తను కొత్తగా కొని తెచ్చుకున్న హిందుస్తాని ఎల్పీ రికార్డును పక్క గదిలో వింటుండగా శాస్త్రిగారి వద్ద కూర్చున్న మా చెవులలో పడింది. అందరం అ గది లోకి వెళ్లి విన్నం. అది పాకిస్తాన్ లోని విద్వాంసులు సలామత్ అలీ, నజాకత్ అలీ గానం చేసిన పహాడీ రాగపు ఠుమ్రి - "సయ్యా బిన్ ఘర సునా". వోలేటి వారు నాలుగైదు సార్లు అ రికార్డు పదే పదే వేయించుకు విని పరవశులైపోయారు.
హిందుస్తాని సంగీతం లో కుడా మహా విద్వాంసులైన వోలేటి గారు అ పారవశ్యంలో అరగంట సేపు పహాడీ రాగం ఆలపించారు. కృష్ణశాస్త్రి గారు తానొక పాట వ్రాస్తానని, వోలేటి గారిని బాణీ కట్టమని అడిగారు. వెంటనే వోలేటి గారు స్పందించగా రూపొందిన సుమధుర గేయమే ఈ "కడచేనటే సకియా ఈ రాతిరి". రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం లో వోలేటి ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.
కడచేనటే సకియా, ఈ రాతిరి
కడుభారమైన ఎడబాటున
అయ్యయ్యో!
ఈ మేఘవేళ ఏమోకదే చెలియా!
స్వామి దవ్వైన, నిదుర రాదాయెనే
అయ్యయ్యో!
ఈ కడిమివోలె ఎదురుచూచేనే సకియా!
ఏకాకి నా బ్రతుకు చేదాయెనే
అయ్యయ్యో!
1 comment:
Very interesting,good job and thanks for sharing such a good blog.your article is so convincing that I never stop myself to say something about it.You’re doing a great job.Keep it up
idhatri - this site also provide most trending and latest articles
Post a Comment